కరోనాతో కర్నాటక ఎంపీ మృతి

కరోనాతో కర్నాటక ఎంపీ మృతి
ఇటీవల కర్నాటకలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా..

ఇటీవల కర్నాటకలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కరోనా మాత్రం కంట్రోల్ కావడం లేదు. ఈ రోజు కరోనాతో బీజేపీ ఎంపీ మృతి చెందారు. రాయ్‌చూర్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ అశోక్ గాస్టి కరోనా చికిత్స పొందుతూ బెంగళూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించారు. ఇటీవల ఆయనకు కరోనా సోకగా 15 రోజుల క్రితం మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు. ఎంపీ మృతి పట్ల పార్టీలకు అతీతంగా సంతాపం తెలుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story