సీరియల్ టైమ్ మార్చండి ప్లీజ్ అన్నందుకు..

సీరియల్ టైమ్ మార్చండి ప్లీజ్ అన్నందుకు..
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో పాటు చెన్నై ఐపీఎల్ టీమ్ కి, స్టార్ మాకి ట్వీట్ చేశారు..

బుల్లి తెర సీరియల్స్ ని అభిమానించని ప్రేక్షకులు అరుదుగానే ఉంటారేమో.. ఇక ఓ ఛానెల్ లో వస్తున్ కార్తీక దీపం సీరియల్ గురించి అయితే చెప్పక్కర్లేదు.. తెలుగురాష్ట్ర ప్రజలను అమితంగా ఆకర్షించిన ఆ సీరియల్ వచ్చే సమయానికే 13వ ఐపీల్ మ్యాచ్ కూడా మొదలవుతోంది.. సూర్యాపేటకు చెందిన పవిత్రపు శివ చరణ్ ఇంట్లో ఒకరికి సీరియల్ నచ్చితే మరొకరికి మ్యాచ్ చూడాలని ఉంది. అదే విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో పాటు చెన్నై ఐపీఎల్ టీమ్ కి, స్టార్ మాకి ట్వీట్ చేశారు..

ఇది చాలా సీరియస్ ఇష్యూ అని మ్యాచ్ ని రాత్రి 8 గంటలకు ప్రసారం చేయమంటూ సదరు సీరియల్ ప్రసారం చేసే ఛానెల్ కి కూడా సెపరేట్ గా ట్వీట్ చేశారు. ఈ వ్యవహారం అంతా కార్తీక దీపం లో దీప పాత్ర పోషిస్తున్న ప్రీమీ విశ్వనాథ్ కు తెలిసింది. ఓ సీరియల్ ని ఇంతగా అభిమానించే ప్రేక్షకులు ఉన్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వారి అభిమానానికి సంతోషించిన ఆమె తానే స్వయంగా ఓ లెటర్ దాంతో పాటు 32 అంగుళాల టీవీని కొని శివచరణ్ ఇంటికి పంపించింది. శివచరణ్ ఇంటికి దీప టీవీ పంపించిన విషయం తెలుసుకున్న చుట్టుపక్కల మాక్కూడా ఈ ఆలోచన వస్తే బాగుండేది.. మాకు టీవీ వచ్చేది అని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story