ప్రధాని మోదీపై.. మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు.. !

ప్రధాని మోదీపై.. మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు.. !
ప్రధాని మోదీపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మోదీ అసమర్ధుడని.. ఆయన దేశాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లలేరని విమర్శించారు.

ప్రధాని మోదీపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మోదీ అసమర్ధుడని.. ఆయన దేశాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లలేరని విమర్శించారు. పురూలియా జిల్లాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో దీదీ ప్రసగించారు. నియంతలా మోదీ వ్యవహరిస్తున్నారని.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారిని అణిచివేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ హఠావో.. దేశ బచావో అంటూ ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక బెంగాల్ లో టీఎంసీ మళ్లీ అధికారంలోకి వస్తే ఉచిత రేషన్ అందుబాటులోకి తీసుకువస్తామని మమతా హామీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story