పెళ్లైన రెండో రోజే రైల్లో ప్రియుడిని..

పెళ్లైన రెండో రోజే రైల్లో ప్రియుడిని..
ఇష్టం లేదంటున్నా ఇంట్లో వాళ్లు బలవంతంగా పెళ్లి చేశారు. అన్యమనస్కంగానే అత్తారింట్లో అడుగుపెట్టింది.

ఇష్టం లేదంటున్నా ఇంట్లో వాళ్లు బలవంతంగా పెళ్లి చేశారు. అన్యమనస్కంగానే అత్తారింట్లో అడుగుపెట్టింది. అయినా ప్రియుడు గుర్తొస్తున్నాడు. ప్రేమించిన వాడు ఆమె కోసం రైల్వేస్టేషన్లో ఎదురు చూస్తున్నాడు. ఇద్దరూ బెంగళూరు వెళ్లే రైలెక్కారు. రైల్లోనే ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేశాడు.

ఇది జరిగి రెండు నెలలైనా ప్రేమికులద్దరూ తమ పెళ్లి ముచ్చట్లను, తమ వివాహానికి సంబంధించిన ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వార్త ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. బీహార్‌కు చెందిన అనుకుమారి, అషు కుమార్‌లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

ఈ విషయం ఇరు కుటుంబాల వారికి తెలిసి ఇద్దర్నీ దూరం పెట్టారు. ఒకరికి ఒకరు కలుసుకోనివ్వకుండా చూశారు. అనుకుమారి తల్లిదండ్రులు ఆలస్యం చేస్తే కష్టమని భావించి రెండు నెలల క్రితం కిరణ్ పూర్ గ్రామానికి చెందిన యువకుడితో అనుకుమారికి పెళ్లి చేశారు. ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేదు. పెద్దలు బలవంతంగా పెళ్లి చేశారు.

మెడలో మూడు ముళ్లు పడినా ప్రేమించిన వాడే కళ్ల ముందు కనిపిస్తున్నాడు. అత్తగారింటి నుంచే ప్రియుడికి సమాచారం అందించింది. ఇద్దరూ కలిసి కుటుంబానికి దూరంగా వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకున్నారు. పెళ్లైన రెండో రోజే ప్రేమించిన ప్రియుడితో కలిసి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అక్కడ బెంగళూరు వెళ్లే రైలు ఎక్కేశారు. రైల్లోనే ప్రియుడి చేత నుదుటన బొట్టు పెట్టించుకుని మెడలో మూడు ముళ్లు వేయించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story