మమతా బెనర్జీకి మద్దతు ప్రకటించిన NCP అధినేత శరద్ పవార్.. !
By - TV5 Digital Team |25 March 2021 3:30 PM GMT
బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రత్యర్థులు మమతా బెనర్జీకి మద్దతుగా రంగంలోకి దిగుతున్నారు. NCP అధినేత శరద్ పవార్... మమతా బెనర్జీకి మద్దతు ప్రకటించారు.
బెంగాల్లో టఫ్ ఫైట్ నడుస్తోంది. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నాయి. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రత్యర్థులు మమతా బెనర్జీకి మద్దతుగా రంగంలోకి దిగుతున్నారు. NCP అధినేత శరద్ పవార్... మమతా బెనర్జీకి మద్దతు ప్రకటించారు. అంతేకాదు ఆమె తరఫున ఎన్నికల ప్రచారం చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఆయన బెంగాల్ టూర్ కూడా ఖరారైంది. ఏప్రిల్ 1 నుంచి 3 వరకు శరద్ పవార్ బెంగాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని NCP అధికార ప్రతినిధి మహేశ్ తపసే వెల్లడించారు. మూడు రోజుల టూర్లో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోనూ పవార్ సమావేశమవుతారు. తృణమూల్ నిర్వహించే భారీ ర్యాలీల్లోనూ పాల్గొనేలా ప్లాన్ రెడీ చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com