అప్పుడు నిర్భయ కోసం ఇప్పుడు హాథ్రాస్ కోసం న్యాయవాది 'సీమా కుష్వాహా'

అప్పుడు నిర్భయ కోసం ఇప్పుడు హాథ్రాస్ కోసం న్యాయవాది సీమా కుష్వాహా
బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి అనుమతించకపోతే, నన్నుకూడా పెట్రోల్ పోసి సజీవ దహనం చేయమని సీమా ఆవేదనగా అన్నారు.

హాథ్రాస్ జిల్లాలో అత్యాచారానికి గురైన వ్యక్తి మరణించిన తరువాత న్యాయం పొందే బాధ్యతను నిర్భయ న్యాయవాది సీమా కుష్వాహా తీసుకున్నారు. బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి సుప్రీంకోర్టు న్యాయవాది సీమా గురువారం హాథ్రాస్‌కు చేరుకున్నారు. కానీ పోలీసులు ఆమెను గ్రామం వెలుపలే ఆపేశారు. ఈ సమయంలో సీమకు పోలీసులకు మధ్య తీవ్ర చర్చ, ఘర్షణ జరిగింది.

ఢిల్లీ నిర్భయ కేసులో నిందితులకు శిక్ష విధించిన సుప్రీంకోర్టు న్యాయవాది సీమా కుష్వాహా, హత్రాస్ నిర్భయ దోషులను శిక్షించాలని నిశ్చయించుకున్నారు. గురువారం, సరిహద్దు బాధిత గ్రామానికి చేరుకున్నారు. కాని ఆమెను గ్రామం లోపలికి రానివ్వకుండా ఆపేశారు పోలీసులు. ఆ సమయంలో, తాను న్యాయవాదినని, బాధితురాలి కుటుంబాన్ని కలవాలని కోరుకుంటున్నానని, సీమ పోలీసులకు తెలిపింది. మీడియాతో సీమా మాట్లాడుతూ తాను మృతురాలి సోదరుడితో మాట్లాడానని, బాధితురాలి కుటుంబాన్ని కలవాలని కోరుకుంటున్నానని చెప్పారు. హాథ్రాస్ కుమార్తెకు న్యాయం చేసే బాధ్యతను కూడా ఆమె తీసుకున్నారు. ఈ కేసుపై ఆమె ఖచ్చితంగా పోరాడతానని అంటున్నారు.

పోలీసు పరిపాలనపై కోపంగా ఉన్న నన్ను కూడా సజీవ దహనం చేయండి , బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి అనుమతించకపోతే, నన్ను కూడా పెట్రోల్ పోసి తగలబెట్టి సజీవ దహనం చేయమని సీమా ఆవేదనగా అన్నారు.

ఈ సమయంలో, ప్రభుత్వ పరిపాలనపై మహిళల భద్రత గురించి ఆమె అనేక ప్రశ్నలు సంధించారు. దేశంలో మహిళలు ఎవరూ సురక్షితంగా లేరని ఆమె అన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉత్తరప్రదేశ్ ప్రధాని ఏం చేస్తున్నారు. మహిళల భద్రతపై వారి వ్యూహం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సెప్టెంబర్ 14 న హాథ్రాస్ జిల్లాలోని చందపా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక గ్రామంలో దళిత బాలిక హత్యాచారానికి గురైంది. బాలికను హింసించిన తరువాత, ఆమెను చంపే ఉద్దేశ్యంతో గొంతు కోసి చంపడానికి ప్రయత్నించారని, ఆ కారణంగా బాలిక మెడ విరిగిందని సీమా ఆరోపించారు. బాలికను మొదట అలీఘర్‌లోని జెఎన్ మెడికల్ కాలేజీలో చేర్పించారు, పరిస్థితి విషమించిన తరువాత ఆమెను ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స జరుగుతున్న సమయంలో, బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది.

నిర్భయ కేసుపై పోరాడిన న్యాయవాది సీమా కుష్వాహా.. ఈ కేసులో నలుగురు నిందితులు ముఖేష్ సింగ్, అక్షయ్ సింగ్ ఠాకూర్, పవన్ కుమార్ గుప్తా, వినయ్ కుమార్ శర్మలను మార్చి 20 న ఉరికంభం ఎక్కించింది. నిర్భయకు న్యాయం చేసిన ఘనత సీమాకు దక్కుతుంది. అటువంటి పరిస్థితిలో, ఆమె హాథ్రాస్ కేసు విషయంలో పోరాడితే, న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు దేశ ప్రజలు.

న్యాయవాది సీమా సమృద్ది కుష్వాహా ఎవరు?

ఉత్తర ప్రదేశ్ లోని ఎటావాకు చెందిన సీమా సమృద్ధి కుష్వాహా ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి లా స్టడీస్ పూర్తి చేశారు. నిర్భయపై దాడి చేసినప్పుడు 2012 డిసెంబర్‌లో సీమా శిక్షణ పొందుతోంది. ఈ సంఘటన గురించి సీమాకు తెలియగానే, ఆమె ఈ కేసుతో పోరాడాలని నిర్ణయించుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎటువంటి రుసుము వసూలు చేయకూడదని అప్పుడే నిర్ణయించుకుంది.

అది ఆమెకు మొదటి కేసు. ఈ కేసును గెలవడానికి సీమా తన పూర్తి శక్తిని ఉపయోగించింది. నిర్భయ కుటుంబానికి న్యాయం జరిగేందుకు చేస్తున్న న్యాయపోరాటంలో అందుకు సంబంధించిన ఏ చిన్న ఆధారాన్నీ వదిలిపెట్టలేదు.

అత్యాచార బాధితుల కోసం కోర్టులో కేసులతో పోరాడుతున్న జ్యోతి లీగల్ ట్రస్ట్‌లో 2014 లో సీమ చేరారు. సీమ న్యాయవాద వృత్తిని చేపట్టాలని ఎన్నడూ అనుకోలేదు. ఆమె కలలెప్పుడూ ఐ.ఎ.ఎస్ కావాలని ఉండేది. ఇందుకోసం యుపిఎస్‌సికి కూడా సిద్ధమయ్యింది. కానీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, ఆమె తన న్యాయవాద వృత్తిని ఇష్టంగా మలచుకుంది ఈ రంగంలోనే ముందుకు సాగాలని నిర్ణయించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story