Odisha : 70 ఏళ్ల వయసులో టెన్త్ పరీక్షలు రాసిన ఎమ్మెల్యే..!

Odisha : 70 ఏళ్ల వయసులో టెన్త్ పరీక్షలు రాసిన ఎమ్మెల్యే..!
Odisha : చదువుకి వయసుతో సంబంధం లేదని నిరూపించాడు ఓ ఎమ్మెల్యే.. 70 ఏళ్ల వయసులో పరీక్ష రాశారు.

Odisha : చదువుకి వయసుతో సంబంధం లేదని నిరూపించాడు ఓ ఎమ్మెల్యే.. 70 ఏళ్ల వయసులో పరీక్ష రాశారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. పుల్బాని ఎమ్మెల్యే, బిజూ జనతాదళ్ నేత అంగడ కన్హర్ నాలుగు దశాబ్దాల క్రితమే చదువు మానేశారు.

ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఆయనకీ ఎప్పటికైనా పదోతరగతి పాస్ అవ్వాలని అనుకుంటూ ఉండేవారు. తీరిక చూసుకొని ఈ ఏడాది వార్షిక పరీక్షకి హాజరయ్యారు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆయన ఈ పరీక్షకు హాజరవ్వడం విశేషం.

పరీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తానో లేదో తెలియదు. కానీ మెట్రిక్యులేషన్ డిగ్రీ పొందాలనే ఉద్దేశ్యంతోనే తాను ఈ పరీక్ష రాసినట్టుగా వెల్లడించారు. కాగా శుక్రవారం మొదలైన బోర్డు పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5.71 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

మొత్తం 3,540 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. వారితో పాటు 9378 మంది ఓపెన్​ స్కూల్​, 4443 మంది మాధ్యమ పరీక్షల రాశారు.

Tags

Read MoreRead Less
Next Story