బెంగాల్లో దీదీ, టీఎంసీ నేతల గుండాగిరి చెల్లవు : మోదీ
By - TV5 Digital Team |10 April 2021 1:45 PM GMT
ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్ సిలిగురిలో మోదీ.. ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్ సిలిగురిలో మోదీ.. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీదీ, టీఎంసీ నేతల ఉగ్రవాద వ్యూహాలు బెంగాల్లో చెల్లవని హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న మద్దతు చూసి టీఎంసీ గుండాలు వణికిపోతున్నారని ఆరోపించారు. బెంగాల్లో కొత్త ఏడాదిలో బీజేపీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొలువు తీరనుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com