PM Modi : జమ్మూకశ్మీర్‌లో ప్రధాని మోదీ.. ఆర్మీ జవాన్లతో కలిసి దీపావళీ వేడుకలు

PM Modi  : జమ్మూకశ్మీర్‌లో ప్రధాని మోదీ.. ఆర్మీ జవాన్లతో కలిసి దీపావళీ వేడుకలు
PM Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ... దేశ సరిహద్దుల్లో ఆర్మీ జవాన్లతో కలిసి దీపావళీ వేడుకలు జరుపుకోనున్నారు. ఇందుకోసం ఈ రోజు జమ్మూ కశ్మీర్‌లో పర్యటిస్తారు.

PM Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ... దేశ సరిహద్దుల్లో ఆర్మీ జవాన్లతో కలిసి దీపావళీ వేడుకలు జరుపుకోనున్నారు. ఇందుకోసం ఈ రోజు జమ్మూ కశ్మీర్‌లో పర్యటిస్తారు. ఈసారి రాజౌరీ జిల్లా నౌషిరా సెక్టార్‌ లోని ఎల్‌ఓసీ వెంబడి జవాన్లతో కలిసి దీవాళీని ప్రధాని మోదీ జరుపుకోనున్నారని ప్రధాని కార్యాలయ వర్గాలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని ఒకరోజు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

దేశ సరిహద్దుల్లోని జవాన్లలో స్థైర్యాన్ని నింపేందుకు,,, ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన 2014 నుంచి ప్రతి ఏటా దీవాళీని దేశ సరిహద్దుల్లోని సైనికుల మధ్య జరుపుకోవడం చేస్తున్నారు. చివరిసారి 2019లో రాజౌలీ సందర్శించి జవాన్ల మధ్య దీవాళీ వేడుకలు జరిపారు. గత ఏడాది కరోనా కారణంగా ఈ కార్యక్రమం జరగలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మరోసారి ప్రధాని రాజౌరీ వెళుతున్నారు.

ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత 24 రోజులుగా ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య నిరంతరాయంగా కాల్పులు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల బలగాలు అప్రమత్తమయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story