ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన రాష్ట్రపతి

ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన రాష్ట్రపతి
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి కావడం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి కావడం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీ కన్నుమూయడంతో ఓ శకం ముగిసిందని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో మహోన్నత నేత అని, ఆయన భరత మాతకు ఓ రుషి మాదిరిగా సేవ చేశారని కొనియాడారు. అత్యంత విలువైన బిడ్డల్లో ఒకరిని కోల్పోయినందుకు దేశం శోకిస్తోందని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ప్రజలందరికీ సంతాపం తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story