ఫలితాల రోజే బాంబు పేల్చిన ప్రశాంత్ కిషోర్..!

ఫలితాల రోజే బాంబు పేల్చిన ప్రశాంత్ కిషోర్..!
పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్ ఫలితాల రోజే ఓ బాంబు పేల్చారు.

పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్ ఫలితాల రోజే ఓ బాంబు పేల్చారు. ఇక నుంచి తాను ఎన్నికల వ్యూహాలు రచించబోనని, ఏ పార్టీకి పనిచేయనని స్పష్టం చేశారు. ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు.ప్రశాంత్ కిశోర్ ఏ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తే ఆ పార్టీ విజయదుంధుభి మోగిస్తోంది. బెంగాల్ లో మమతా, తమిళనాడులో స్టాలిన్ తరపున పని చేయగా.. ఆ పార్టీలు సంచలన విజయాలు నమోదు చేశాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పని చేశారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్, అమరీందర్ సింగ్, 2019లో జగన్, 2020లో కేజీవాల్ వైపు నిలబడ్డారు. ఈ పార్టీలన్నీ గెలిచాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కూడా విజయం వైపు దూసుకుపోతుంది.

Tags

Read MoreRead Less
Next Story