నివర్ తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు

నివర్ తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నడిచే 8 రైళ్లు దారి మళ్లించి, ఒక రైలును రద్దు చేశారు.

నివర్ తుఫాన్ ఎఫెక్ట్ దక్షిణ మధ్య రైల్వే రాకపోకలపై ప్రభావం చూపుతోంది. చెన్నై సెంట్రల్-తిరుపతి రైలు రైల్వే శాఖ రద్దు చేసింది. హైదరాబాద్-తంబరం, మధురై-బికనీర్, చెన్నై సెంట్రల్-సంత్రగచ్చి రైళ్లు రద్దయ్యాయి. తుఫాన్ ప్రభావంతో పలు రైళ్లను దారి మళ్లించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నడిచే 8 రైళ్లు దారి మళ్లించి, ఒక రైలును రద్దు చేశారు. ఏపీ, తెలంగాణ మీదుగా నడిచే 7 రైళ్లను రద్దు చేసి, ఎనిమిదింటిని దారి మళ్లించారు.

నివర్ తుఫాన్ పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది. బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున గం.2.30 మధ్య నివర్ తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌లను రంగంలోకి దించారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని సూచించారు. ఓడ రేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. ప్రయాణీకులు రైళ్ల సమాచారం కోసం సంప్రదించవలసిన నెంబర్లు 040-2783 3099, విజయవాడ 0866-2767239, గుంతకల్ 7815915608, గుంటూరు 0863-2266138.

Tags

Read MoreRead Less
Next Story