Rickshaw Puller: రిక్షాపుల్లర్కు రూ.3 కోట్లకు పైగా పన్ను.. ఐటీ శాఖ నోటీసులు..
Rickshaw Puller: రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవులు. బతుకు బండి సాగాలంటే కష్టమైనా రిక్షా తొక్కాల్సిందే. లేకపోతే కడుపు నిండదు. ఇంట్లో ఒక్కడి సంపాదన మీదే ఇంటిల్లపాదీ ఆధారపడుతుంటారు. ఖర్చులు పోగా దాచుకుందామంటే రోజుకు రూ.100లు కూడా మిగలదాయే. ఎంత ఇన్కం ఉంటే రూ.3 కోట్లకు పైగ పన్ను కడతాడు.. ఓ పెద్ద ఇండస్ట్రియలిస్ట్, లేదా బడా వ్యాపారవేత్తకు మాత్రమే సాధ్యమవుతుంది. పొట్టకోస్తే అక్షరం ముక్క రాదు ఐటీ పన్నుల గురించి అసలే తెలియదు. కోట్లకు పైగా చెల్లించాలంటూ ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) నోటీసు అందుకున్న రిక్షా పుల్లర్ ఆదివారం పోలీసులను ఆశ్రయించాడు.
ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లా బకాల్పూర్ ప్రాంతంలోని అమర్ కాలనీలో నివసిస్తున్న ప్రతాప్ సింగ్, ఐటీ శాఖ నుండి నోటీసు అందుకున్న తర్వాత, మోసం జరిగిందని తెలుసుకున్నాడు. హైవే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.అయితే పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదని, ఈ విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
ఇంతలో, సింగ్ సోషల్ మీడియాలో వీడియో క్లిప్ను అప్లోడ్ చేశాడు, దీనిలో అతను సంఘటనల క్రమాన్ని వివరించాడు. మార్చి 15న జన్ సువిధ కేంద్రంలో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నానని, దానిని సమర్పించాల్సిందిగా బ్యాంక్ని కోరినట్లు సింగ్ తెలిపారు.
అనంతరం, అతను బకల్పూర్కు చెందిన సంజయ్ సింగ్ (మొబైల్ నం. 9897762706) నుండి పాన్ కార్డ్ కలర్ ఫోటోకాపీని పొందాడు. సింగ్ నిరక్షరాస్యుడు కావడంతో ఒరిజినల్ పాన్ కార్డ్కి, కలర్ జిరాక్స్కి మధ్య తేడాను గుర్తించలేకపోయాడు, అక్టోబర్ 19 న తనకు ఐటీ అధికారుల నుంచి కాల్ వచ్చిందని, రూ .3,47,54,896 చెల్లించాలని నోటీసు అందజేసినట్లు సింగ్ తెలిపారు.
వ్యాపార నిమిత్తం ఎవరో తనను మోసగించారని తన పేరు మీద GST నంబర్ పొందారని సింగ్ తెలిపాడు. 2018-19లో వ్యాపారి టర్నోవర్ రూ. 43,44,36,201 అని పోలీసుల ఎంక్వైరీలో తేలింది. తనను మోసగించినందున ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఐటి అధికారులు తనకు సూచించారని సింగ్ అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com