Microsoft : మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల‌కు తీపిక‌బురు..

Microsoft : మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల‌కు తీపిక‌బురు..
Microsoft : మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల ఒక శుభవార్తను అందించారు. ఉద్యోగులకు త్వరలో జీతం పెరగనుందని తెలిపారు.

Microsoft : మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల ఒక శుభవార్తను అందించారు. ఉద్యోగులకు త్వరలో జీతం పెరగనుందని తెలిపారు. మైక్రోసాఫ్ట్ "గ్లోబల్ మెరిట్ బడ్జెట్‌ను దాదాపు రెట్టింపు చేసింది" అని అతను ఒక ఇమెయిల్‌లో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల జీతాలను పెంచుతున్నాయి. అత్యున్నత ప్రతిభ ఉన్న ఉద్యోగులను నిలుపుకోవడం కోసం ఈ ప్రయత్నాలు ప్రారంభించాయి.

మీరు చేస్తున్న అద్భుతమైన పని కారణంగా నాయకత్వ బృందంలో మీ ప్రభావం గుర్తించబడింది. అందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. అందుకే మీలో ప్రతి ఒక్కరిపై దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్నాం" అని నాదెళ్ల తన ఉద్యోగులకు రాసిన ఈమెయిల్‌ లో పేర్కొన్నారు.

భారీ వేతన పెంపును ప్రకటించిన ఏకైక సంస్థ మైక్రోసాఫ్ట్ కాదు. అమెజాన్ ఫిబ్రవరిలో కార్పొరేట్, టెక్ ఉద్యోగులకు గరిష్ట మూల వేతనాన్ని రెట్టింపు చేసింది. టాప్ టాలెంట్‌ను రిక్రూట్ చేసుకోవడానికి మరియు ఉన్న ఉద్యోగులను కొనసాగించడానికి ఎక్కువ శాలరీ ఆఫర్ చేస్తోంది.

"ప్రత్యేకంగా, మేము మా బడ్జెట్‌ను దాదాపు రెట్టింపు చేస్తున్నాము. స్థానిక మార్కెట్ డేటా ఆధారంగా మెరిట్ బడ్జెట్‌లు దేశం వారీగా మారుతూ ఉంటాయి మార్కెట్ డిమాండ్‌ను బట్టి వార్షిక స్టాక్ శ్రేణులను కనీసం 25 శాతం పెంచుతున్నాము, "అని ఆయన చెప్పారు. కాబట్టి పెంపు ఎక్కువగా ఇటీవల సంస్థలో చేరిన ఉద్యోగులతో పాటు వారి కెరీర్ మధ్యలో ఉన్న ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది.

జనరల్ మేనేజర్‌లు, వైస్ ప్రెసిడెంట్‌లు మరియు ఇతర టాప్ ఎగ్జిక్యూటివ్‌లు వంటి మైక్రోసాఫ్ట్ "భాగస్వామ్య స్థాయి"కి చేరుకున్న ఉద్యోగులు ఇతర ఉద్యోగుల కంటే ఎక్కువ పొందలేరు. జనవరిలో, గూగుల్ తన నలుగురు టాప్ ఎగ్జిక్యూటివ్‌ల జీతాలను పెంచింది.

Tags

Read MoreRead Less
Next Story