Shocking News: నదిలో స్నానం చేస్తున్న వ్యక్తిని లాక్కెళ్లిన మొసలి..
By - Prasanna |19 May 2022 5:26 AM GMT
Shocking News: రాజస్థాన్ కోటలోని రామ్ ఘాట్ వద్ద తెల్లవారుజామున ఖటోలీ పార్వతి నదిలో ఓ వ్యక్తి స్నానం చేస్తుండగా అతడిపై మొసలి దాడి చేసింది.
Shocking News: రాజస్థాన్ కోటలోని రామ్ ఘాట్ వద్ద తెల్లవారుజామున ఖటోలీ పార్వతి నదిలో ఓ వ్యక్తి స్నానం చేస్తుండగా అతడిపై మొసలి దాడి చేసింది. రామ్ ఘాట్ వద్ద తెల్లవారుజామున ఖటోలీ పార్వతి నదిలో బిల్లూ స్నానం చేస్తున్నాడు. ఒక మొసలి అతనిపై దాడి చేసి నదిలోకి లాగింది. నదిలో స్నానం చేస్తున్న మరికొందరు ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
అతడి కోసం అధికారులు నదిలో గాలిస్తున్నారు. ఆ వ్యక్తి ఆచూకీ కోసం కోటా ఎస్డిఆర్ఎఫ్ బృందం సహాయం కూడా కోరింది. మొసళ్లు ఉండడంతో నదిలోకి వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com