మహారాష్ట్రలో షిరిడి సాయిబాబా ఆలయం మూసివేత..!

మహారాష్ట్రలో షిరిడి సాయిబాబా ఆలయం మూసివేత..!
మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో షిర్డీలోని సాయి బాబా ఆలయాన్ని మూసివేయాలని శ్రీ సాయిబాబా సంస్థ ట్రస్ట్ (SSST) నిర్ణయించింది.

మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో షిర్డీలోని సాయి బాబా ఆలయాన్ని ఈ రోజు రాత్రి 8 గంటలకు, అంటే 2021 ఏప్రిల్ 5 నుండి మూసివేయాలని శ్రీ సాయిబాబా సంస్థ ట్రస్ట్ (SSST) నిర్ణయించింది. ఈ ఆలయం 2021 ఏప్రిల్ 30 వరకు మూసివేయబడుతుంది. సాయి ఆలయంతో పాటుగా ప్రసాదాలయ, భక్త నివాస్ కూడా భక్తుల కోసం మూసివేయబడతాయి. కాగా సాయిబాబుకు ఆలయ పూజారులచే రోజువారి పూజలు జరుగుతాయి.

Tags

Read MoreRead Less
Next Story