sonu Sood : సోనూసూద్ కీలక నిర్ణయం..!
దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే..కరోనా మహమ్మారికి ధాటికి చాలామంది బలైపోతున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో దేశ ప్రజలకు నేనున్నాననే ధైర్యం ఇస్తున్నారు రియల్ హీరో సోనూసూద్. ఇప్పటికే చాలా మంది కరోనా బాధితులకు అండగా నిలిచిన సోనూసూద్ .. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చాలామంది కోవిడ్ బాధితులు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే.
అయితే ఇకపై అలా జరగకుండా చూసేందుకు ఏకంగా ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పేందుకు సిద్ధమయ్యాడు సోనూసూద్. అందులో భాగంగానే ముందుగా నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఫ్రాన్స్ తో పాటు ఇతర దేశాల నుంచి వీటిని విక్రయిస్తున్నారు. కొవిడ్ కేసులు అత్యధికంగా ఉన్న ఢిల్లీ, మహారాష్ట్ర తోపాటు మరికొన్ని రాష్ట్రాలలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. తొలి ప్లాంట్ ఫ్రాన్స్ నుంచి మరో పది రోజుల్లో భారత్ కు రానుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com