మరింత మెరుగుపడుతున్న ఎస్పీ బాలు ఆరోగ్యం

మరింత మెరుగుపడుతున్న ఎస్పీ బాలు ఆరోగ్యం
కరోనా బారినపడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మరింత మెరుగుపడిందని ఎస్పీ చరణ్ తెలిపారు.

కరోనా బారినపడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మరింత మెరుగుపడిందని ఎస్పీ చరణ్ తెలిపారు. శుక్రవారం నుంచి ఆహారం కూడా తీసుకుంటున్నారని.. ఈ మధ్య సుమారు 20 నిమిషాల పాటు వైద్యుల సాయంతో లేచి కూర్చుంటున్నారని తెలిపారు. అయితే, ఇంకా ఆయనకు వెంటిలేటర్ సాయంతోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేవని.. కానీ, ఊపిరితిత్తుల పనితీరు మరింత మెరుగపడాల్సి ఉందని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story