కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్.. పేరు పెడితే లక్షలు..

కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్.. పేరు పెడితే లక్షలు..
కేంద్ర ఆర్థిక శాఖ దేశ ప్రజలకు ఆసక్తికరమైన పోటీ పెట్టింది. తాము ప్రవేశ పెట్టిన కొత్త పథకానికి అనువైన పేరు, ట్యాగ్‌లైన్, లోగోలను సూచించిన వారికి భారీ బహుమతులు ఇస్తామని ప్రకటించింది.

కేంద్ర ఆర్థిక శాఖ దేశ ప్రజలకు ఆసక్తికరమైన పోటీ పెట్టింది. తాము ప్రవేశ పెట్టిన కొత్త పథకానికి అనువైన పేరు, ట్యాగ్‌లైన్, లోగోలను సూచించిన వారికి భారీ బహుమతులు ఇస్తామని ప్రకటించింది. మరి ఈ పోటీకి సంబంధించిన వివరాలేంటో చూద్దాం..

ఆగస్టు 15లోగా..

కేంద్రం ఇటీవల మౌలిక సదుపాయాల కల్పన కోసం డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్‌కి ఆమోదం తెలిపింది. ఇప్పుడీ డీఎఫ్‌ఐ.. తీరు తెన్నులు, లక్ష్యాలను స్పురించేలా ఈ పథకానికి పేరు, ట్యాగ్‌లైన్, లోగోలను సూచించాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ఆగస్టు 15వ తేదీ సాయింత్రం 5:30 గంటల్లోగా తమ ఎంట్రీలను పంపించాలని తెలిపింది.

ఈ పోటీలో ఒక్కో విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.15 లక్షలు బహుమతిగా అందిస్తామని పేర్కొంది. రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.3 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన ఎంట్రీలకు రూ.2 లక్షల వంతున బహుమతులు ప్రకటించారు.

ఎలా పంపాలంటే..

దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రజలందరికీ తేలికగా అర్థమయ్యేలా పలకడానికి సులువుగా ఉండేలా డీఎఫ్‌ఐకి సంబంధించిన పేరు, ట్యాగ్‌లైన్, లోగోలు ఉండాలని తెలిపింది. పేరు, ట్యాగ్‌లైన్, లోగో డిజైన్లు రూపొందించిన వారు https://www.mygov.in/task/name-tagline-and-logo-contest-development-financial-institution లింక్ ద్వారా కేంద్రానికి ఎంట్రీలను పంపాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్.. పేరు పెడితే లక్షలు..డీఎఫ్‌ఐ

కేంద్ర ప్రభుత్వం ఇటీవల నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డెవలప్‌మెంట్ యాక్ట్ 2021 ద్వారా డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ (డీఎఫ్‌ఐ)కు ఆమోదం తెలిపింది. ఈ డీఎఫ్‌ఐ ద్వారా దేశంలో మౌలిక సదుపాయాల కల్పన మెరుగు పరచడం కోసం భారీ ఎత్తున ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. సుమారు 1.11 లక్షల కోట్ల వ్యయంతో 7,000 ప్రాజెక్టులు చేపట్టబోతోంది. ఈ పథకం ద్వారా దేశ రూపు రేఖలు మారతాయని కేంద్రం చెబుతోంది.

Tags

Read MoreRead Less
Next Story