భిక్షాటన నిషేధంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

భిక్షాటన నిషేధంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Supreme Court: బిక్షాటన నిషేధంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

Supreme Court: భిక్షాటన నిషేధంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వీధుల్లో భిక్షాటనను నిషేధించేందుకు ఉన్నత వర్గాలకు అనుకూలంగా పక్షపాత దోరణిని తాను ప్రదర్శించలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. విద్య, ఉపాధి లేకపోవడంతో కనీస జీవనోపాధిని పొందడం కోసం బిచ్చమెత్తుకోవడానికి వీధుల్లో వస్తున్నారని తెలిపింది. ఇది సాంఘీక, ఆర్ధిక సమస్య అని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో వీధుల్లో తిరిగే బిచ్చగాళ్లకు నిరాశ్రయులకు వ్యాక్సిన్ వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

పిటిషనర్ తరుపు వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకెట్ చిన్మయ్ శర్మను ఉద్దేశించి జస్టిస్ చంద్రచూడ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. వారు వీధుల్లోకి వచ్చి ఎందుకు బిచ్చమెత్తుకుంటున్నారని ఎదురు ప్రశ్నించింది. పేదరికం వల్ల వారు ఈ పనిచేస్తున్నారని, అత్యున్నత న్యాయస్థానంగా.. తాము పక్షపాతంతో ఉన్నత వర్గాలకు అనుకూల దృక్పధాన్ని అనుసరించలేమని తేల్చిచెప్పింది. అయితే బిచ్చమెత్తుకోవాలని ఎవరు కోరుకోరని, వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద బిచ్చగాళ్లను తొలగించాలని తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

ఇది ప్రభుత్వం స్పందించాల్సిన సాంఘీక, సంక్షేమ విధానానికి సంబంధించిన విషయమని కోర్టు తెలిపింది. మా కళ్లముందు నుంచి వాళ్లను దూరంగా ఉంచండని తాము ఆదేశించలేమని తెలిపింది. ఈ మానవ సమస్యను పరిష్కరించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ సర్కారును ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అడ్వకెట్ కుశ్‌ కల్రా దాఖలుచేశారు.

Tags

Read MoreRead Less
Next Story