సుప్రీంకోర్టులో ఫేస్బుక్ ఇండియాకు భారీ ఊరటః
By - shanmukha |23 Sep 2020 3:31 PM GMT
సుప్రీం కోర్టులో ఫేస్బుక్ ఇండియా ఉపాధ్యక్షుడు, ఎండీ అజిత్ మోహన్కు ఊరట లభించింది.
సుప్రీం కోర్టులో ఫేస్బుక్ ఇండియా ఉపాధ్యక్షుడు, ఎండీ అజిత్ మోహన్కు ఊరట లభించింది. ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీలో జరిగిన అల్లర్ల సమయంలో విద్వేశపూరిత ప్రసంగాలను ఫేస్బుక్ ద్వారా ప్రచారం అయ్యాయని.. దీనిని బాధ్యత వహిస్తూ అజిత్ మోహన్ తమ ప్యానల్ ముందు హాజరు కావాలని ఢిల్లీ అసెంబ్లీ ప్యానల్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసింది. దీనిని సవాల్ చేస్తూ ఫేస్బుక్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం అక్టోబర్ 15 వరకూ అజిత్ మోహన్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఢిల్లీ అసెంబ్లీని ఆదేశించింది. న్యాయశాఖ, హోంశాఖ, ఐటీశాఖ, లోక్సభ, రాజ్యసభ సెక్రటరీలు, ఢిల్లీ పోలీసులకు కూడా ఈ ఆదేశాలు జారీ చేసింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com