టాలీవుడ్ నిర్మాత కరోనాతో మృతి
By - Admin |31 Aug 2020 1:29 PM GMT
కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీపై పంజా విసురుతోంది. 5 నెలలుగా షూటింగ్స్ లేక సినీ కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీపై పంజా విసురుతోంది. 5 నెలలుగా షూటింగ్స్ లేక సినీ కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా గత రాత్రి నిర్మాత బోగారి లక్ష్మీనారాయణ కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో 'ఎదురీత' సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com