Jammu and Kashmir : జమ్ము కశ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
By - TV5 Digital Team |19 Feb 2021 11:25 AM GMT
Jammu and Kashmir : జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.. బుద్గాం జిల్లాలో అతి దగ్గర నుంచి పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయాడు ఓ ఉగ్రవాది.
Jammu and Kashmir : జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.. బుద్గాం జిల్లాలో అతి దగ్గర నుంచి పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయాడు ఓ ఉగ్రవాది.. రద్దీగా ఉన్న భగత్ బర్జుల్లా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. షర్ట్లో ఏకే-47 దాచుకుని వచ్చిన ఉగ్రవాది విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.. పోలీసులే టార్గెట్గా కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది.. ఉగ్రవాది కాల్పుల్లో పోలీసు అధికారి మృతిచెందాడు.. ఆ వెంటనే ఉగ్రవాది అక్కడ్నుంచి పారిపోయాడు.. అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రవాదులను వెంబడించాయి. బలగాలు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి.. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com