Chota Rajan : కరోనాతో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మృతి..!
By - TV5 Digital Team |7 May 2021 11:00 AM GMT
గత నెల 24న కరోనా సోకిన అతన్ని .. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా, డాకర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న అతడు కాసేపటి క్రితం కన్నుమూశాడు.
అండర్ వరల్డ్ డాన్ రాజేంద్ర నికల్జే అలియాస్ చోటా రాజన్ మృతి చెందాడు. గత నెల 24న కరోనా సోకిన అతన్ని .. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా, డాకర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న అతడు కాసేపటి క్రితం కన్నుమూశాడు. తీహార్ జైల్లో అతనికి కరోనా సోకగా,, మెరుగైన చికిత్స కోసం అతన్నీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 61 ఏళ్ల రాజన్ 2015 లో ఇండోనేషియాలోని బాలి నుండి బహిష్కరించబడిన తరువాత అరెస్టు అయినప్పటి నుండి న్యూ ఢిల్లీలోని హై-సెక్యూరిటీ తీహార్ జైలులో ఉన్నారు. ఈయనపై 70కిపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com