బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట విషాదం.. !

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట విషాదం.. !
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట విషాదం నెలకొంది.. ఆమె సోదరుడు ఆశిమ్ బెనర్జీ (60) కరోనాతో కన్నుమూశారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట విషాదం నెలకొంది.. ఆమె సోదరుడు ఆశిమ్ బెనర్జీ (60) కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయనకు చికిత్స అందిస్తుండగానే ఆయన ప్రాణాలు కోల్పోయారు.. కువైట్ నిబంధనల ప్రకారం ఆశిమ్ అంత్యక్రియలు నిర్వహిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు సీఎం మమతాకి ఆరుగురు సోదరులు కాగా ఆశిమ్ చిన్నవాడు. వీరందరూ కోల్ కత్తా లోని ఖాళీఘాట్ లో నివాసంలోనే ఉంటారు. కాగా బెంగాల్ లో శుక్రవారం రోజు కొత్తగా 20,846 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,94,802కు చేరింది. మరణాల సంఖ్య 12,993కు పెరిగింది.

Tags

Read MoreRead Less
Next Story