లిఫ్ట్ అడిగింది.. నిండా ముంచేసింది..!

లిఫ్ట్ అడిగింది.. నిండా ముంచేసింది..!
ప్రస్తుత సమాజంలో ఎవరు ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టమైంది. మాటల్లో, చేతల్లో అస్సలు అర్ధం కాదు.

ప్రస్తుత సమాజంలో ఎవరు ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టమైంది. మాటల్లో, చేతల్లో అస్సలు అర్ధం కాదు. తాజాగా ఎమర్జెన్సీ అంటూ లిఫ్ట్‌ అడిగిన ఒక మహిళ లిఫ్ట్‌ ఇచ్చిన సదరు వ్యక్తిని నిండా ముంచేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని వడ్డరహళ్లిలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. వడ్డరహళ్లికి చెందిన నంజేగౌడ అనే వ్యక్తి స్థానికంగా వ్యాపారం చేస్తుంటాడు. నిత్యం మేడలో బంగారు గొలుసులు వేసుకుని ఉంటాడు. అయితే ఈనెల 26న వ్యాపార నిమిత్తం బైక్‌పై బయలుదేరాడు. అదే సమయంలో బైక్‌ను ఆపిన లక్ష్మి అనే మహిళ.. తన స్నేహితురాలి డెలివరీకి అర్జెంటుగా డబ్బులు ఇవ్వాలని, డ్రాప్‌ చేయాలని అడిగింది.

ఘాటి రోడ్డులో తనను దింపాలని లక్ష్మి అడగడంతో నంజేగౌడ ఆమెను నమ్మి తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో అనుమానం వచ్చి ఆమెను ప్రశ్నించాడు. ఇదంతా జరుగుతున్న సమయంలోనే వెనుకనే మరో బైక్‌పై అనుసరించి వచ్చిన రాజేశ్, మణికంఠ నంజేగౌడపై దాడి చేసి బంగారు గొలుసులు లాక్కున్నారు. నంజేగౌడ కేకలు వేయడంతో స్థానికులు వచ్చి మణికంఠను పట్టుకున్నారు. అయితే లక్ష్మి, రాజేశ్‌ అప్పటికే బంగారు గొలుసులతో పరారయ్యారు. మణికంఠ దొరకడంతో పోలీసులకి అప్పగించారు. అనంతరం లక్ష్మి, రాజేష్ లని పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story