మేకప్ ఎంత పని చేసింది.. చర్మం ఊడి చేతిలోకి..
అందంగా కనిపించాలి.. అందరూ నన్నే చూడాలి. అందుకోసం బ్యూటీ పార్లకు వెళ్లి అందానికి మెరుగులు దిద్దుకోవాలి.. ఇలా అనుకొని గుజరాత్కు చెందిన ఓ అమ్మ.. తన ఇద్దరు కూతుళ్లతో కలిసి బ్యూటీ పార్లర్కి వెళ్లింది. అక్కడ ముగ్గురూ మేకప్ చేయించుకుని అట్నించి బంధువుల ఇంట జరిగే పెళ్లికి వెళ్లారు. పెళ్లి వేడుకల్లో పాల్గొన్న అనంతరం తిరిగి తమ స్వగ్రామం సూరత్కు చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న అనంతరం ముగ్గురూ మేకప్ తీద్దామని ముఖం కడుక్కున్నారు.
అద్దంలో చూసుకునేసరికి ముఖం వాచి పోయి వుంది. ముఖం కడుగుతున్న సమయంలో చర్మం ఊడి చేతికి వచ్చింది. ముఖం మండుతున్నట్లు అనిపించి వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెత్తారు ముగ్గురూ. డాక్టర్లు వారిని పరీక్షించి బ్యుటీషియన్ హానికారక రసాయనాలు వాడారని తెలుసుకున్నారు. ముగ్గురినీ ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను అరెస్టు చేసి విచారిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com