వ్యవసాయ బిల్లుకు మద్దతు తెలిపిన వైసీపీ రాజ్యసభ ఎంపీలు
By - shanmukha |20 Sep 2020 7:39 AM GMT
దేశవ్యాప్తంగా రైతుల నుంచి విమర్శలకు గురవుతున్న వ్యవసాయ బిల్లులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది.
దేశవ్యాప్తంగా రైతుల నుంచి విమర్శలకు గురవుతున్న వ్యవసాయ బిల్లులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే రైతులకు స్వేచ్చ లభిస్తుందని.. దళారీ వ్యవస్థ స్వస్థిపలకొచ్చని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఇటీవల లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సంబందించిన చర్చలో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఈ బిల్లుతో రైతులకు ఎంతో ప్రయోజనం జరుగుతుందని అన్నారు. పంటలకు ముందుగానే ధర నిర్ణయించవచ్చని అన్నారు. దళారీ ఆగడాలు నుంచి రైతులు విముక్తి పొందుతారని అన్నారు. కాగా.. ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com