వ్యవసాయ బిల్లుకు మద్దతు తెలిపిన వైసీపీ రాజ్యసభ ఎంపీలు

వ్యవసాయ బిల్లుకు మద్దతు తెలిపిన వైసీపీ రాజ్యసభ ఎంపీలు
దేశవ్యాప్తంగా రైతుల నుంచి విమర్శలకు గురవుతున్న వ్యవసాయ బిల్లులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది.

దేశవ్యాప్తంగా రైతుల నుంచి విమర్శలకు గురవుతున్న వ్యవసాయ బిల్లులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే రైతులకు స్వేచ్చ లభిస్తుందని.. దళారీ వ్యవస్థ స్వస్థిపలకొచ్చని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఇటీవల లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సంబందించిన చర్చలో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఈ బిల్లుతో రైతులకు ఎంతో ప్రయోజనం జరుగుతుందని అన్నారు. పంటలకు ముందుగానే ధర నిర్ణయించవచ్చని అన్నారు. దళారీ ఆగడాలు నుంచి రైతులు విముక్తి పొందుతారని అన్నారు. కాగా.. ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story