America: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మరణించినవారిలో ఇద్దరు తెలుగు విద్యార్థులు..

America: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మరణించినవారిలో ఇద్దరు తెలుగు విద్యార్థులు..
America: ఈ ప్రమాదంలో ఫియట్ కారులో ప్రయాణిస్తున్న వంశీకృష్ణతో పాటు డ్రైవర్ మేరీ కూడా మరణించింది.

America: చదువు కోసం, ఉద్యోగం కోసం దేశాన్ని విడిచి అమెరికా వెళ్తున్న వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. కానీ అలా వెళ్లినవారు ఏదో ఒక ప్రమాదానికి గురవుతూ ప్రాణాలు విడవడం మాత్రం బాధాకరం. తాజాగా ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతిచెందడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండేలా చేసింది.

అమెరికాలోని ఇల్లినాయిస్‌లో అక్కడి కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు వంశీకృష్ణ పెచ్చెట్టి(23) తన స్నేహితుడితో కలిసి ఫియట్ కారులో వెళ్తున్నాడు. ఈ కారును స్ధానిక మహిళా డ్రైవర్ మేరీ ఎ. మెయునియర్ (32) డ్రైవ్ చేస్తుంది. మధ్యలో ఈ కారు అదుపుతప్పి రోడ్డుకు అవతలి వైపుకు దూసుకెళ్లింది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న టయోటా కారును ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ఫియట్ కారులో ప్రయాణిస్తున్న వంశీకృష్ణతో పాటు డ్రైవర్ మేరీ కూడా మరణించింది. వీరితో పాటు టయోటా కార్ నడుపుతున్న పవన్ స్వర్ణ(23) కూడా అక్కడికక్కడే కన్నుమూశాడు. టాయోటా కార్ లో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉప్పలపాటి యశ్వంత్, కాకుమాన్ కార్తీక్, డోర్న కళ్యాణ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో కార్తిక్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story