Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
పెషావర్ లో తెగబడ్డ ముష్కరులు
AA


పాక్‌ ప్రధాన నగరం పెషావర్‌లోని యూఎస్ కాన్సొలేట్‌పై ముష్కరులు తెగబడ్డారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతను సైతం ఛేదించుకుని వెళ్లిన మిలిటెంట్లు భద్రతాబలగాలను ఢీకొన్నారు. ఇరు పక్షాల మధ్య భీకరమైన కాల్పులు జరిగాయి. అయితే.. ఈ ఘటనపై ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. నింగినుంచి హెలికాప్టర్ల ద్వారా కాన్సొలేట్‌పై నిఘాను పెంచారు. అదనపు పోలీసు బలగాలను పంపి.. ఘటనాస్థలానికి దారితీసే అన్ని దారులనూ మూసివేశారు. పెషావర్‌లోని యూఎస్ కాన్సొలేట్‌పై దాడి జరగడం ఇది రెండోసారి.

గతంలో ఏప్రిల్ ఐదున ఆటమిక్ వెపన్స్‌తో దాడి చేసిన మిలిటెంట్లు.. ముగ్గురి ప్రాణాలు తీసుకున్నారు. ఆరుగురు తీవ్రవాదులు కూడా మృతిచెందారు. తాజా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి వుంది. ఇప్పటికే.. పాక్‌ నగరాలన్నీ ముష్కరుల స్థావరాలుగా మారిపోయాయని వైట్‌హౌస్ కోడైకూస్తుండగా, తాజాగా యుఎస్ కాన్సొలేట్‌పైనా దాడి జరగడాన్ని అమెరికా మరింత సీరియస్‌గా తీసుకునే అవకాశముంది.

Published Date : Saturday, Aug 28, 04:15pm IST

Watch Video....
Related Articles
Gallery