విద్యార్థినులకు DRDO స్కాలర్‌షిప్స్.. ఏటా రూ.1,86,000 వరకు..

విద్యార్థినులకు DRDO స్కాలర్‌షిప్స్.. ఏటా రూ.1,86,000 వరకు..

డిఫిన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ప్రతిభ ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థినులను ప్రోత్సహించే దిశగా స్కాలర్‌షిప్ అందిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి సంస్థ కొన్ని నియమనిబంధనల్ని విధించింది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, స్పేస్ ఇంజనీరింగ్, రాకెట్రీ, ఏవియానిక్స్, ఎయిక్రాప్ట్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ చదువుతున్న అమ్మాయిలు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డీఆర్‌డీవో సహకారంతో ఏరోనాటిక్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బోర్డ్ ఈ స్కాలర్‌షిప్స్‌ను అందిస్తుంది. మొత్తం 30 స్కాలర్‌షిప్స్ ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ 2019 జులై 25 న ప్రారంభమైంది. సెప్టెంబర్ 10తో ముగుస్తుంది. దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్: https://rac.gov.in/.

బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయిలకు 20 స్కాలర్‌షిప్స్ ఉన్నాయి. ఏటా రూ. 1,20,000 లేదా వార్షిక ఫీజును స్కాలర్‌షిప్ రూపంలో అందిస్తుంది డీఆర్‌డీఓ. నాలుగేళ్ల వరకు ఈ స్కాలర్‌షిప్ పొందొచ్చు. JEE (Main) స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతున్న అమ్మాయిలకు 10 స్కాలర్‌షిప్స్ ఉన్నాయి. వీరికి నెలకు రూ.15,500 చొప్పున ఏటా రూ.1,86,000 వరకు ఆర్థిక సాయం లభిస్తుంది. ఈ స్కాలర్‌షిప్ రెండేళ్లు ఇస్తారు. క్వాలిఫయింగ్ ఎగ్జామ్‌లో కనీసం 60% మార్కులతో పాటు గేట్ స్కోర్ తప్పనిసరి. ఈ స్కాలర్‌షిప్ రెండేళ్లు ఇస్తారు. స్కాలర్‌షిప్‌కు అర్హత సాధించిన విద్యార్థినులు అన్ని పరీక్షలో పాస్ కావాలి. స్కాలర్‌షిప్ కోసం ఎంపికైనవాళ్లు డీఆర్‌డీఓ. ప్రభుత్వ ల్యాబరేటరీస్ లేదా AR&DB నిధులతో నడుస్తున్న సంస్థల్లో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story