లాటరీలో రూ.25కోట్లు గెలుచుకున్న వార్త తెలిసి ఆమె..
By - Admin |26 Aug 2020 10:18 AM GMT
సరదాగా లాటరీ టికెట్ కొన్నది ఆస్ట్రేలియాకు చెందిన 20 ఏళ్ల విశ్వవిద్యాలయ విద్యార్థి. ఆ తరువాత యథాలాపంగా తనపనులేవో
సరదాగా లాటరీ టికెట్ కొన్నది ఆస్ట్రేలియాకు చెందిన 20 ఏళ్ల విశ్వవిద్యాలయ విద్యార్థి. ఆ తరువాత యథాలాపంగా తనపనులేవో తాను చేసుకుంటోంది. ఓ రోజు ఆన్ లైన్ తరగతులు వింటుండగా.. ఫోన్ కి మెసేజ్ వచ్చింది లాటరీ తగిలిందని.. రూ.25 కోట్లు గెలుచుకున్నారని.. అయినా ఏమాత్రం తొణకకుండా పాఠం వినడం పూర్తయిన తరువాత తన అదృష్టానికి తనే ఆశ్చర్యపోయింది. సెట్ ఫర్ లైఫ్ లాటరీని గెలుచుకున్న ఆమె ఈ డబ్బుతో ఏం చేస్తావని అడిగితే తన తల్లికి ఓ ఇల్లు, తనకి ఓ ఇల్లు కొనుక్కుంటానంది. ఆస్ట్రేలియాతో పాటు మరిన్ని దేశాలు చుట్టి వస్తానని తెలిపింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com