బ్రెజిల్ అధ్యక్షుడి కుమారుడికి కరోనా పాజిటివ్
By - Admin |26 Aug 2020 2:45 PM GMT
బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో కుమారుడు, సెనేటర్ ఫ్లావియో బొల్సనారోకు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే తెలిపారు
బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో కుమారుడు, సెనేటర్ ఫ్లావియో బొల్సనారోకు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే తెలిపారు. తనకు చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని తెలిపారు. అయితే, తన ఆరోగ్యం బాగానే ఉందని.. పెద్దగా లక్షణాలు లేవని అన్నారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నానని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. కరోనా చికిత్సలో బాగంగా హైడ్రాక్సిక్లోర్లోక్విన్ వాడుతున్నానని కూడా ఫ్లావియో ప్రకటించారు. కాగా.. జైర్ బొల్సనారో కూడా ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. జైర్ భార్య, ఆయన నాలుగో కుమారుడికి కూడా కరోనా సోకింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com