కర్ణాటకను కలవరపెడుతున్న కరోనా ..

కర్ణాటకను కలవరపెడుతున్న కరోనా ..
కర్నాటకలో పెరుగుతున్న కరోనా కేసులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

కర్నాటకలో పెరుగుతున్న కరోనా కేసులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల కరోనా టెస్టులు సంఖ్య పెంచడంతో పాజిటివ్ కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. వరుసగా 8వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 8,580 కేసులు నమోదయ్యాయని కర్నాటక ఆరోగ్యశాఖ వెల్లడించింది. అటు, మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. బుధవారం ఒక్కరోజే 133 మంది కరోనాతో మరణించారు. తాజాగా నమోదైన కరోనా కేసులతో కర్నాటకలో 3,00,406మంది కరోనా బారినపడ్డారు. ఇందులో కరోనా నుంచి 2,11,688 మంది కోలుకోగా.. ఇంకా 83,608 మంది చికిత్స పొందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story