భారీ అగ్నిప్రమాదం.. ఐదు ప్రైవేటు బస్సులు దగ్దం

భారీ అగ్నిప్రమాదం.. ఐదు ప్రైవేటు బస్సులు దగ్దం
చెన్నైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదు ప్రైవేటు బస్సులు దగ్ధమయ్యాయి.

చెన్నైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదు ప్రైవేటు బస్సులు దగ్ధమయ్యాయి. కోయంబేడు ప్రాంతంలోని ఆమ్నీ బస్టాండు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

లాక్‌డౌన్‌ కారణంగా ఆంధ్రా, కేరళ, కర్నాటక రాష్ట్రా లకు వెళ్లే ప్రైవేటు బస్సులను ఆమ్నీ బస్టాండులో నిలిపి ఉంచారు. ఈ నేపథ్యంలో ఆదివారం అకస్మాత్తుగా ఓ బస్సులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో గాలి బలంగా వీయడంతో పక్కనే ఉన్న మరో నాలుగు బస్సులకు కూడా నిప్పంటుకుంది. ఈ ప్రమాదంలో మూడు బస్సులు పూర్తిగా.. మరో రెండు బస్సులు పాక్షికంగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story