ఏపీలో కరోనాతో ఒక్కరోజే 97 మంది మృతి

ఏపీలో కరోనాతో ఒక్కరోజే 97 మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా స్వైర విహారం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా స్వైర విహారం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రతిరోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,276 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,45,216కు చేరింది. ఒక్కరోజే కరోనా బారిన పడి 97 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,189కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 89,389 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 2,52,638 డిశ్చార్జ్ అయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story