బొల్లారం పోలీస్ స్టేషన్ లో ఏసీబీ తనిఖీలు

బొల్లారం పోలీస్ స్టేషన్ లో ఏసీబీ తనిఖీలు

హైదరాబాద్‌లోని బొల్లారం పోలీస్ స్టేషన్ లో ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది.. స్టేషన్ బెయిల్ పేరుతో ఓవ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేశారు సిబ్బంది. పది వేల రూపాయలను పేటీఎం ద్వారా చెల్లించామని బాధితులు చెబుతున్నారు. అయితే బెయిల్ ఇవ్వకుండా మరిన్ని డబ్బులు డిమాండ్ చేశారు ఎస్సై బ్రహ్మచారి. దీంతో బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. వారం రోజులుగా సమాచారాన్ని సేకరించిన ఏసీబీ అధికారులు సోమవారం స్టేషన్ కు వచ్చారు. దాదాపు 3 గంటలుగా ఎస్సైతోపాటు సిబ్బందిని విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story