జింకను తప్పించబోయి డివైడర్ ను ఢీకొట్టి..
By - Admin |25 Aug 2020 7:39 AM GMT
ఆ దంపతులకు మృత్యువు జింక రూపంలో ముంచుకొచ్చింది. బళ్లారిలో ఉన్న కుమారుడిని చూసేందుకు పుంగనూరు నుంచి కారులో బయలు దేరిన
ఆ దంపతులకు మృత్యువు జింక రూపంలో ముంచుకొచ్చింది. బళ్లారిలో ఉన్న కుమారుడిని చూసేందుకు పుంగనూరు నుంచి కారులో బయలు దేరిన కొద్దిసేపటికే మృత్యువాతకు గురయ్యారు. పుంగనూరులోని వస్త్రవ్యాపారి పిండుకూరి బాలాజి (60), భార్య లత (55). వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు బళ్లారిలో స్థిరపడ్డాడు. కుమార్తె అమెరికాలో నివసిస్తోంది. కొడుకును చూసేందుకు కారులో బయలు దేరిన దంపతులు ముదిగుబ్బ మండలం ఎన్ఎస్పీ కొట్టాల వద్దకు రాగానే కారుకు జింక అడ్డు వచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో కారు డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో బాలాజీ అక్కడికక్కడే మృతి చెందారు. లతను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. డ్రైవర్ రాజేశ్ గాయాలతో బయటపడ్డారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com