చింతమడక అభివృద్ధికి అదనంగా రూ.50కోట్లు

చింతమడక అభివృద్ధికి అదనంగా రూ.50కోట్లు

తన సొంతూరు చింతమడకపై వరాలు జల్లు కురిపించారు సీఎం కేసీఆర్‌. ఆ గ్రామంలో పర్యటించిన ముఖ్యమంత్రి ప్రతి కుటుంబం పది లక్షల రూపాయలు లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామానికి 50 కోట్లు మంజూ చేస్తామన్నారు. 2వేల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో మౌలిక వసతులన్నీ కల్పిస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్‌.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ తన స్వగ్రామం చింతమడకలో పర్యటించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక.. సీఎం హోదాలో తొలిసారి ‌సొంతూరు వెళ్లారు. ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు గ్రామస్థులు. ముందుగా శివాలయం, రామాలయం వెళ్లారు కేసీఆర్‌. గ్రామదేవతలకు పూజలు చేశారు. బాల్య మిత్రులతో ముచ్చటించారు. అందరిని ఆప్యాయంగా పలకరించారు.

గ్రామస్థులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు కేసీఆర్. వరాలు జల్లు కురిపించారు. నెల రోజుల్లో ఊళ్లో సమస్య అనేది లేకుండా చేయాలంటూ కలెక్టర్‌, ఎమ్మెల్యేల్ని ఆదేశించారు. ప్రతి కుటుంబానికి 10 లక్షలు లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదనంగా గ్రామానికి 50 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారాయన. చింతమడక.. బంగారు తునక కావాలని సీఎం ఆకాంక్షించారు. చింతమడకకు 2 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించిన కేసీఆర్‌. కార్తీక మాసంలో గృహప్రవేశాలు జరుగుతాయన్నారు. చింతమడక తనని కనిపెంచిందన్న ఆయన... గ్రామానికి ఎంత చేసినా తక్కువేన్నారు. ....

ఆత్మీయ సమ్మేళనంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు మాట్లాడారు. కేసీఆర్‌ రాకతో బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలన్నీ ఒకేసారి వచ్చినట్లైందన్నారు. సీఎం ఇచ్చిన వరాలతో చింతమడక చింతలేని గ్రామం అవుతుందన్నారు. .కేసీఆర్‌ వరాలపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా ప్రకటన చేయడంతో వలస వెళ్లిన కుటుంబాలు తిరిగి సొంతూరికి వచ్చేస్తున్నాయి..

Tags

Read MoreRead Less
Next Story