కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్య
By - TV5 Telugu |31 May 2019 3:51 AM GMT
నిజామాబాద్ జిల్లాలో ఓ కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. నగరంలోని రోటరీ నగర్లోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కాంగ్రెస్ ఎంపిటీసీ అభ్యర్థి గణేష్. ఇటీవలే జరిగిన పరిషత్ ఎన్నికల్లో సిరికొండ మండలం తన స్వగ్రామం తాళ్ల రామడుగులో ఎంపీటీసీగా పోటీ చేశాడు. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడాల్సి ఉండగా గణేష్ ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తీవ్ర మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com