లోక్సభలో హోదా స్వరం వినిపించిన గల్లా జయ్దేవ్
By - TV5 Telugu |25 Jun 2019 9:13 AM GMT
లోక్సభలో హోదా స్వరం వినిపించారు టీడీపీ ఎంపీ గల్లా జయ్దేవ్. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు బీజేపీని ఏపీ ప్రజలు శిక్షించారని.. స్టేటస్ సాధించే బాధ్యతను వైసీపీకి అప్పగించారని అన్నారాయన. హోదా ఇవ్వబోమని సోమవారం మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన విషయాన్ని జయ్దేవ్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ యాక్షన్ ప్లాన్ కోసం అన్ని వర్గాలు ఆత్రుతగా చూస్తున్నాయని అన్నారాయన.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com