సరికొత్త రికార్డు సృష్టించిన హైదరాబాద్ మెట్రో రైల్
By - TV5 Telugu |15 Aug 2019 9:28 AM GMT
హైదరాబాద్ మెట్రో రైల్ మరో రికార్డు సృష్టించింది. బుధవారం ఒక్కరోజే మెట్రోలో 3 లక్షల 6 వేల మంది ప్రయాణం చేశారు. పెరుగుతున్న ట్రాఫిక్కి మెట్రోనే ప్రత్యమ్నాంగా కనిపిస్తుండడంతో.. నెమ్మదిగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అన్ని రూట్లలోనూ మెట్రో సేవల్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. సేఫ్టీ క్లియరెన్స్ రాగానే అమీర్పేట - హైటెక్సిటీ రూట్లో 5 నిమిషాలకో సర్వీస్ ఉంటుందన్నారు. రద్దీ వేళల్లో ప్రతి 3 నిమిషాలకు ఒక మెట్రో రైలు తిరిగేలా చూస్తామన్నారు. రాయదుర్గం వరకూ మెట్రోను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని వివరించారు.
Also Watch :
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com