టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి.. కాంగ్రెస్ ఎంపీ వర్గీయులకు మధ్య వాగ్వాదం
By - TV5 Telugu |31 May 2019 6:41 AM GMT
నల్గొండలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికి.. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వర్గీయులకు మధ్య వాగ్వాదం జరిగింది. క్లాక్టవర్ సెంటర్లో ఇరువర్గాల గొడవతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ కేంద్రం సమీపంలోనే పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో.. ఇరువర్గాలను చెదరగొట్టారు పోలీసులు. ముందు జాగ్రత్తగా అదనపు బలగాలను మోహరించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com