తెలంగాణ టీడీపీ నేతలను కలిసిన చంద్రబాబు

తెలంగాణ టీడీపీ నేతలను కలిసిన చంద్రబాబు

ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని..అంతమాత్రానికే అధైర్యపడొద్దని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కార్యకర్తల్లో మనోధైర్యం నింపాలని నేతలకు సూచించారు. మెడికల్ చెకప్ కోసం అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చిన చంద్రబాబును తెలంగాణ టీడీపీ నేతలు కలిశారు…తెలుగు రాష్ట్రాల్లో ఎదురైన ఓటమికి కారణాలపై చర్చించారు. పార్టీ పునర్ నిర్మాణం కోసం త్వరలో కార్యచరణ సిద్ధం చేస్తామని సీనియర్ నేత రావుల చెప్పారు.. నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజాసమస్యలపై పోరాటం చేస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story