Omicron India: పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల సంఖ్య.. ప్రస్తుతం దేశంలో..

Omicron India: పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల సంఖ్య.. ప్రస్తుతం దేశంలో..
Omicron India: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది.

Omicron India: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కేసులు సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా గుజరాత్​లో ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధరణ అయింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 145కు చేరింది. బ్రిటన్​ నుంచి ఆదివారం గుజరాత్​కు వచ్చిన ఓ వ్యక్తితో సహా బాలుడిలో ఒమిక్రాన్ వేరియంట్​ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఆ ఇద్దరిని అహ్మదాబాద్​లోని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్​ కేసులను ప్రభుత్వాలు గుర్తించాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 48 కేసులు బయటపడ్డాయి. దిల్లీలో 22, తెలంగాణ 20, రాజస్థాన్​ 17, కర్ణాటక 14, కేరళ 11, గుజరాత్​ 9, ఆంధ్రప్రదేశ్, చంఢీగఢ్​, తమిళనాడు, బెంగాల్​లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ నిర్ధరణ అయిన 48 మందిలో 28 మంది ఇప్పటికే కోలుకుని ఇళ్లకు వెళ్లారని అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story