Kerala: దేశంలో ఇదే మొదటిసారి.. లింగమార్పిడి చేసుకున్న ఇద్దరు పెళ్లి..

Kerala: దేశంలో ఇదే మొదటిసారి.. లింగమార్పిడి చేసుకున్న ఇద్దరు పెళ్లి..
Kerala: కేరళలో అరుదైన పెళ్లి జరిగింది. ఇద్దరు ట్రాన్స్​జెండర్లు వివాహం చేసుకున్నారు.

Kerala: కేరళలో అరుదైన పెళ్లి జరిగింది. ఇద్దరు ట్రాన్స్​జెండర్లు వివాహం చేసుకున్నారు. లింగమార్పిడి చేయించుకున్న ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి. ప్రేమికుల రోజునే ఈ పెళ్లి జరగింది. శ్యామ ఎస్​ ప్రభ, మను కార్తీక పదేళ్లుగా స్నేహితులు. కార్తిక ఓ ప్రైవేటు సంస్థ హెచ్​ఆర్ డిపార్ట్​మెంట్‌లో ఉద్యోగి. ప్రభ కేరళ ప్రభుత్వ సంక్షేమ శాఖ ట్రాన్స్​జెండర్ సెల్ కో-ఆర్డినేటర్.

ఐదేళ్ల క్రితమే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వారు లింగమార్పిడి చేయించుకున్నారు. ప్రేమికుల రోజున తిరువనంతపురంలో బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యారు. అయితే.. ఈ రకమైన వివాహం చట్టబద్ధం కాదు. దీనిపై వారు కోర్టును ఆశ్రయించనున్నారు. తమ పెళ్లి ట్రాన్స్​జెండర్ వివాహాల్లో సరికొత్త మైలురాయి కానుందని చెప్పారు ప్రభ, మను. ​

Tags

Read MoreRead Less
Next Story