పాక్, ఇంగ్లాండ్ టెస్ట్పై మ్యాచ్ఫిక్సింగ్ ప్రకంపనలు
పాకిస్తాన్ క్రికెట్ను మరోసారి ఫిక్సింగ్ భూతం కమ్ముకుంది. లార్డ్స్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో నలుగురు పాక్ క్రికెటర్లు ఫిక్సింగ్కు పాల్పడ్డట్టు 'న్యూస్ ఆఫ్ ది వరల్డ్' అనే ఓ బ్రిటిష్ టాబ్లాయిడ్ సంచలనం కథనం ప్రచురించింది. ఈ పత్రిక చేసిన స్టింగ్ ఆపరేషన్లో పాకిస్తాన్కు చెందిన మజర్ మజీబ్ అనే ఓ బుకీ డబ్బులు తీసుకునే విజువల్స్ సంపాదించిది. దీనిపై స్పందించిన ఐసీసీ విచారణకు ఆదేశించింది. పాక్ కెప్టెన్ సల్మాన్ భట్, బౌలర్లు మహమ్మద్ అసిఫ్, అమేర్, కమ్రాన్ అక్మల్... కావాల్సినప్పుడల్లా నో బాల్స్ వేసేందుకు మజీబ్ నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నలుగురు క్రికెటర్లను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే బుకీని అరెస్టు చేసారు. ఇదిలా ఉంటే మ్యాచ్ మాత్రం కొనసాగుతుందని... ఐసీసీ ప్రకటించింది.
Published Date : August 29, Sunday 01:01PM IST
Watch Video.......
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


