Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
నైట్‌క్లబ్‌ గొడవపై బీసీసీఐ సీరియస్‌


AA

క్రమశిక్షణ ఉల్లంఘించిన భారత క్రికెటర్లపై బీసీసీఐ కొరడా ఝుళిపించింది. కరేబియన్ దీవుల్లో జరిగిన నైట్‌క్లబ్‌ గొడవకు సంబంధించి ఈ రోజు ఆరుగురు క్రికెటర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. శ్రీలంకతో సూపర్ ఎయిట్ మ్యాచ్ ముగిసిన తర్వాత యువరాజ్‌సింగ్ , ఆశిష్‌నెహ్రా , రోహిత్‌శర్మ , రవీంద్ర జడేజా, జహీర్‌ఖాన్ , పియూష్ చావ్లాలు పబ్‌లో ఎంజాయ్ చేయడమే కాక తమను ప్రశ్నించిన అభిమానులతో గొడవకు దిగారు.

అక్కడేమీ జరగలేదని మొదట్లో చెప్పిన జట్టు మేనేజర్ బీసీసీఐకి ఇచ్చిన నివేదికలో మాత్రం గొడవ జరిగినట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఆటగాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేసిన బోర్డ్ వారికి షోకాజ్‌ నోటీసులు పంపించింది. ఈ నోటీసుకు వారం లోపు ఆటగాళ్ళు సమాధానమివ్వాల్సి ఉంటుంది.


Watch Video
Related Articles
Gallery