Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
జింబాబ్వే టార్గెట్ 286 రన్స్


AA

రోహిత్‌ శర్మ సెంచరీ చేయడంతో ట్రై సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 285 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌ ఓపెనర్ల వికెట్లు 100 పరుగుల లోపే కోల్పోయింది. అయితే యువ బ్యాట్స్‌మెన్ రోహిత్‌శర్మ , రైనా , రవీంద్ర జడేజాలతో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

అంతగా అనుభవం లేని జింబాబ్వే బౌలర్లను అలవోకగా ఆడిన రోహిత్‌ శర్మ వన్డేల్లో తన తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. సెంచరీ తర్వాత రోహిత్ ఔటైనా... జడేజా ధాటిగా ఆడడంతో భారత్ 286 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే ముందుంచింది. కాగా జింబాబ్వే బౌలర్లు వైడ్ల రూపంలో 26 పరుగులు ఆదనంగా ఇవ్వడం కూడా భారత్‌ స్కోర్ పెరగడానికి కారణమైంది.

Watch Video
Related Articles
Gallery