బంద్కు పిలుపునిచ్చిన రైస్ మిల్లర్లు

నేటి నుంచి రైస్మిల్లులు బంద్ కానున్నాయి. లేవీ ధాన్యం సేకరణపై ఎఫ్సిఐ వైఖరికి నిరసనగా రైస్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ రైస్ మిల్లుల బంద్కు పిలుపునిచ్చింది. పాత ధరలతో నాలుగేళ్ల కిందటి లేవీ సేకరణ లక్ష్యం కోసం ఎఫ్సిఐ పట్టుబడుతోందని అసోసియేషన్ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ధాన్యం వ్యాపారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మిల్లర్ల సంఘం నాయకులు ముఖ్యమంత్రి రోశయ్యను కలిసి సమస్యను విన్నవించారు. సమస్యపై తక్షణం హామీ ఇస్తే తప్ప సమ్మెను విరమించబోమని స్పష్టం చేశారు.
మిల్లర్ల సమ్మెతో తెలంగాణ, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో దాదాపు 3,500 రైస్ మిల్లుల్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. రైస్ మిల్లర్ల నిర్ణయంతో రబీ సీజన్లో రైతులు పండించిన 17లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కళ్లాలు మార్కెట్యార్డుల్లోనే నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది.
Watch Video...
మిల్లర్ల సమ్మెతో తెలంగాణ, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో దాదాపు 3,500 రైస్ మిల్లుల్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. రైస్ మిల్లర్ల నిర్ణయంతో రబీ సీజన్లో రైతులు పండించిన 17లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కళ్లాలు మార్కెట్యార్డుల్లోనే నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది.
Watch Video...
Click Here to View/Post Comments (1)
| N.JOHNSON JACOB :
Hats off your detaild news coverage. You are presented real facts and figures..Keep it up sir
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |

